ఏప్రిల్ 19 నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రారంభం
మొదటి దశ 2024 సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్ 19న జరుగుతాయి. మొదటి దశలో 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 పార్లమెంట్ నియోజకవర్గాలకు (జనరల్-73; ఎస్టీ-11; ఎస్సీ-18) , అరుణాచల్ , సిక్కిం లో 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. మిగిలిన దశలతో పోల్చి చూస్తే మొదటి దశలో అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయి.